రష్మిక మందన్నా, ధ్రువ సార్జా కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం పొగరు. ఈ చిత్రంలో కాలేజీ అమ్మాయిగా రష్మికను టీజ్ చేస్తూ సాగే సాంగ్ అదిరిపోయేలా చూపించారు డైరెక్టర్ నందకిశోర్. ఈ సాంగ్ ఇప్పుడు కొత్త రికార్డులను సృష్టిస్తోంది.
‘అరే ఎవర్రా ఈ గులాబ్ జామూన్.. ఏయ్ తెల్వదా అన్న గర్ల్ ఫ్రెండ్ బే… అంటూ సాగే ఈ పాట రికార్డు స్తాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటోంది. కరాబు అంటూ సాగే వీడియో సాంగ్ అందరినీ అలరిస్తోంది. ఈ వీడియో సాంగ్కు 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ధ్రువ సార్జా ఈ పాటలో ఊర మాస్ లుక్ లో కనిపిస్తూ.. రష్మికను టీజ్ చేస్తూ తన డ్యాన్స్ తో అదరగొడుతున్నాడు. చుట్టూ గుండాలతో రష్మికను టీజ్ చేస్తుండటం కొత్తగా ఉంది. ఇందులో ధ్రువ తన డ్యాన్స్ తో అదరగొడుతున్నాడు.
ఈ చిత్రంలో సంపత్ రాజ్, ధనంజయ్, రవిశంకర్, పవిత్ర లోకేశ్, గిరిజా లోకేశ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్స్ కై గ్రీనె, మోర్గాన్ ఆస్టే, జోయ్ లిండర్, జాన్ లుకాస్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.