బీహార్ లో మూడు పెట్రోలియం ప్రాజెక్టులకు రేపు ప్రధాని మోదీ శ్రీకారం

బీహార్ లో మూడు పెట్రోలియం ప్రాజెక్టులను ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఎల్పీజీ పైప్ లైన్ ప్రాజెక్టును, రెండు బాట్లింగ్ ప్రాజెక్టులను లాంచ్ చేసి  వీటిని జాతికి అంకితం చేయనున్నారు.

బీహార్ లో మూడు పెట్రోలియం ప్రాజెక్టులకు రేపు ప్రధాని మోదీ శ్రీకారం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 12, 2020 | 7:07 PM

బీహార్ లో మూడు పెట్రోలియం ప్రాజెక్టులను ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఎల్పీజీ పైప్ లైన్ ప్రాజెక్టును, రెండు బాట్లింగ్ ప్రాజెక్టులను లాంచ్ చేసి  వీటిని జాతికి అంకితం చేయనున్నారు. పరదీప్- హల్దియా -దుర్గాపూర్ పైప్ లైన్ ప్రాజెక్టుకు సంబంధించి దుర్గాపూర్-బంకా సెక్షన్ ను ఆయన మొదట ప్రారంభిస్తారు. 193 కి.మీ. పొడవైన ఈ పైప్ లైన్ ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్మించింది. గత ఏడాది ఫిబ్రవరి 17 న మోదీ దీనికి శంకు స్థాపన చేశారు. ఈ పైప్ లైన్ పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలను కూడా కలపడం విశేషం. ఇప్పటివరకు ఇంత పెద్ద పైప్ లైన్ ప్రాజెక్టు దేశంలో లేదని, ఇదే మొదటిదని అంటున్నారు. బీహార్ ఎన్నికలకు క్రమంగా సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ ప్రధానంగా ఈ రాష్ట్రంపై దృష్టి పెట్టింది.