సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ‘పిల్’…
సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పనులను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రదీప్ కుమార్ యాదవ్ అనే యాక్టివిస్ట్ సుప్రీంకోర్టుకెక్కారు. ఈ కోవిద్ పాండమిక్ సమయంలో..ముఖ్యంగా దేశమంతా...
సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పనులను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రదీప్ కుమార్ యాదవ్ అనే యాక్టివిస్ట్ సుప్రీంకోర్టుకెక్కారు. ఈ కోవిద్ పాండమిక్ సమయంలో..ముఖ్యంగా దేశమంతా లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరి కాదని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేసేలా చూడాలని పిటిషన్ దారు దాఖలు చేసిన పిల్ ను హైకోర్టు గతనెల 31 న కొట్టివేసింది. ఇది నేషనల్ ప్రాజెక్టు అని, నిర్మాణ పనులను ఆపాలనడంలో అర్థం లేదని చీఫ్ జస్టిస్ డీ.ఎన్.పటేల్, న్యాయమూర్తి జ్యోతిసింగ్ లతో కూడిన బెంచ్ పేర్కొంది. ఈ పిటిషన్ దురుద్దేశపూరితమని వ్యాఖ్యానించింది. ఈ పిల్ ‘జెన్యూన్’ కాదని స్పష్టం చేసింది. నిర్మాణ కార్మికులు సైట్ లో ఉన్నందున పనులను ఆపాలన్న ప్రసక్తే తలెత్తదని కూడా పేర్కొంది. కాగా రూ. 20 వేల కోట్లతో కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది.
కాగా ఈ ప్రాజెక్టు పనుల్లో ఉన్న కార్మికులు, కూలీలంతా కోవిద్ నిబంధనలను పాటిస్తూ పని చేస్తున్నారని గతంలో వార్తలు వచ్చ్చాయి. వీరిని ప్రత్యేకంగా ఢిల్లీ శివార్లలోని గ్రామం నుంచి తీసుకువచ్చి వారితో పనులు చేయిస్తున్నారు. బహుశా సుప్రీంకోర్టు కూడా ఈ ప్రాజెక్టు పనులకు అనుమతించవచ్చునని భావిస్తున్నారు. ఇవి శరవేగంగా సాగుతున్నాయి. లోగడ విపక్షాలు,కొందరు పర్యావరణ వేత్తలు కూడా ఈ ప్రాజెక్టు పనులకు అభ్యంతరం తెలిపారు. అయితే వీరి వాదనను అధికార బీజేపీ నేతలు ఖండిస్తూ వచ్చారు.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : ఆకాశంలో మరో అద్భుతం ..ఈ సారి గంటకు పైగా వీక్షించే అవకాశం..: solar eclipse Viral Video