బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం, 14 మంది మంత్రులతో కొత్త కేబినెట్, బీజేపీకే ప్రాధాన్యం

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో బాటు 14 మంది మంత్రులుగా..

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం, 14 మంది మంత్రులతో కొత్త కేబినెట్,  బీజేపీకే ప్రాధాన్యం
Follow us

| Edited By: Balu

Updated on: Nov 16, 2020 | 5:55 PM

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో బాటు 14 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు, ఇద్దరు డిప్యూటీ సీఎం లు రేణు దేవి, తర్కిషోర్ ప్రసాద్ ప్రమాణం చేయగా, హిందూస్తాన్ అవామ్ మోర్చా నేత సంతోష్ మాంఝి, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ నేత ముకేశ్ మల్లా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ.నడ్డా, హోమ్ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది. నితీష్ రాష్ట్ర సీఎం పదవిని చేబట్టడం ఇది నాలుగోసారి. మంత్రివర్గ కూర్పులో బీజేపీకి ప్రాధాన్యం లభించింది.