AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్రాజెక్టులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్!

ఏపీలో పర్యావరణ అనుమతుల్లేని ఎత్తిపోతల పథకాలను ఆపాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. గోదావరి-పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులను నిలిపివేయాలని కోరింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ఆయా పథకాలను నడపాలని ఆదేశించింది. గోదావరి, పెన్నా నదులపై ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోందని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌, త్రినాథ్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గతంలోనే విచారణ చేపట్టిన ఎన్జీటీ.. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతుంటే మీరేం […]

ఏపీ ప్రాజెక్టులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 13, 2019 | 6:17 PM

Share

ఏపీలో పర్యావరణ అనుమతుల్లేని ఎత్తిపోతల పథకాలను ఆపాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. గోదావరి-పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులను నిలిపివేయాలని కోరింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ఆయా పథకాలను నడపాలని ఆదేశించింది. గోదావరి, పెన్నా నదులపై ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోందని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌, త్రినాథ్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై గతంలోనే విచారణ చేపట్టిన ఎన్జీటీ.. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతుంటే మీరేం చేస్తున్నారంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీ పీసీబీ) కేంద్ర పర్యావరణ శాఖలపై అక్షింతలు వేసింది. దీనిపై ఆయా బోర్డులతో ఓ సంయక్త కమిటీని నియమించింది. నష్టాన్ని అంచనావేసి నివేదిక ఇవ్వాల్సిందిగా నాలుగు వారాల సమయమిచ్చింది. తాజాగా ఆ కమిటీ నివేదిక అందజేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే ఆయా ప్రాజెక్టులను తిరిగి కొనసాగించాలని స్పష్టం చేసింది.

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!