AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ap food processing policy : ఏపీలో నూతన ఆహారశుద్ధి విధానం అమల్లోకి.. రైతు భరోసా కేంద్రాలే ప్రాసెసింగ్ కేంద్రాలు !

ఏపీలో 2015 నుంచి 2020 వరకూ ఉన్న ఆహార శుద్ధి విధానం ముగియడంతో..కొత్త  విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతో..

Ap food processing policy : ఏపీలో నూతన ఆహారశుద్ధి విధానం అమల్లోకి.. రైతు భరోసా కేంద్రాలే ప్రాసెసింగ్ కేంద్రాలు !
AP-Government
Ram Naramaneni
|

Updated on: Dec 31, 2020 | 5:25 PM

Share

Ap food processing policy : ఏపీలో 2015 నుంచి 2020 వరకూ ఉన్న ఆహార శుద్ధి విధానం ముగియడంతో..కొత్త  విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతో.. ఏపీలోని  వివిధ వనరుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని రూపోందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు కోసం విస్తృతమైన ల్యాండ్ బ్యాంక్ రాష్ట్రంలో అందుబాటులో ఉందని ప్రభుత్వం వివరించింది.  వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల కోసం కూడా ఇది ఊపయోగపడుతుందని పేర్కొంది. ఆహార శుద్ధి రంగంలో మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మార్క్ స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో కొత్త విధానానికి రూపొందించినట్లు తెలిపింది. కొత్త విధానం అమలు ద్వారా ప్యాకేజింగ్ పరిశ్రమకూ ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టామని తెలిపింది.  రైతు ఆధారిత విధానంగానే దీనికి రూపకల్పన చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

 రైతు భరోసా కేంద్రాలే  ప్రాసెసింగ్ కేంద్రాలు

నూతన ఆహారశుద్ధి విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాలు ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలుగా మారనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు, అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ల అభివృద్ధి, ఆహార నాణ్యతా పరీక్షా కేంద్రాలు, విత్తన నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు కానున్నట్టు గవర్నమెంట్ తెలిపింది.

Also Read : 

Reliance Jio : వినియోగదారులకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. 2021 జనవరి 1 నుంచి అన్ని కాల్స్ ఉచితం

 Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..