Reliance Jio : వినియోగదారులకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. 2021 జనవరి 1 నుంచి అన్ని కాల్స్ ఉచితం
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాల మేరకు 2021 జనవరి 1 నుంచి దేశంలో బిల్ అండ్ కీప్ విధానం అమలు చేస్తున్నామని, తద్వారా అన్ని దేశీయ వాయిస్ కాల్లకు...
Reliance Jio : నూతన సంవత్సరం సందర్భంగా వినియోగదారులకు రిలయన్స్ జియో సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాల మేరకు 2021 జనవరి 1 నుంచి దేశంలో బిల్ అండ్ కీప్ విధానం అమలు చేస్తున్నామని, తద్వారా అన్ని దేశీయ వాయిస్ కాల్లకు ఇంటర్కనెక్ట్ యూజ్ ఛార్జీలు (ఐయుసి) రద్దు చేస్తున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. ఆఫ్-నెట్ దేశీయ వాయిస్-కాల్ ఛార్జీలను సున్నాకి మార్చాలన్న తమ ప్రకటనకు కట్టుబడి ఉంటున్నట్లు పేర్కొంది. ఐయుసి ఛార్జీలు రద్దు చేసిన వెంటనే జియో మరోసారి 2021 జనవరి 1 నుంచి అన్ని ఆఫ్-నెట్ దేశీయ వాయిస్ కాల్లను జియో ఉచితంగా అందజేయనుంది. వాస్తవానికి గతంలో ఈ ఆఫ్ నెట్ కాల్స్ను కూడా జియో ఫ్రీగా అందించింది. అయితే సెప్టెంబర్, 2019లో ట్రాయ్ నుంచి ఆదేశాల రావడంతో ఆఫ్నెట్ వాయిస్ కాల్స్కు ఛార్జీలు వసూలు చేసింది. ట్రాయ్ ఐయుసి ఛార్జీలను రద్దు చేసే వరకు మాత్రమే ఈ ఛార్జీలను కొనసాగుతాయని..ఆ తర్వాత ఉండవని జియో తన వినియోగదారులకు హామీ ఇచ్చింది. మొత్తం 2.22 మిలియన్ల కొత్త మొబైల్ కస్టమర్లను సంపాదించుకున్న రిలయన్స్ జియో, అక్టోబర్లో మొత్తం చందాదారుల సంఖ్య విషయంలో 406.3 మిలియన్ల మార్క్ రీచ్ అయ్యింది.
Also Read : South Central Railway: రైల్వే ప్రయాణీకులు శుభవార్త.. లింగంపల్లి-విశాఖ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్..