కడుపులో కత్తులు పెట్టుకుని ప్రేమపూర్వక కౌగిలింతలు, చీరాలలో ఉప్పు నిప్పులా ఉండే ఇద్దరు నేతల కొత్త యాక్షన్.!

ప్రకాశం జిల్లా చీరాలలో నిన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు...

కడుపులో కత్తులు పెట్టుకుని ప్రేమపూర్వక కౌగిలింతలు, చీరాలలో ఉప్పు నిప్పులా ఉండే ఇద్దరు నేతల కొత్త యాక్షన్.!
Follow us

|

Updated on: Dec 26, 2020 | 9:06 AM

ప్రకాశం జిల్లా చీరాలలో నిన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు కొత్త టచ్ ఇచ్చారు. ఒకే వేదికపై పొందిక, కుదురు ప్రదర్శించారు. చీరాలలో జరిగిన పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ కార్యక్రమంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఏపి విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి అటుపక్క కరణం, ఇటు పక్క ఆమంచి ఎలాంటి విబేధాలు ప్రదర్శించకుండా కామ్‌గా సెటిలయ్యారు. కాగా, ఇటీవల చీరాలలో మత్స్యకారుల మధ్య నెలకొన్న గొడవల నేపధ్యంలో కరణం, ఆమంచి వర్గీయుల మధ్య మళ్లీ ఘర్షణలకు అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వైసీపీకి చెందిన ఈ ఇద్దరు నేతలు తిరిగి ఒకే వేదికపైకి వస్తే ఉద్రిక్తతలు నెలకొంటాయన్న ఉద్దేశ్యంతో పోలీసులు వేదికపై నాయకులను తప్ప వారి అనుచరులను అనుమతించలేదు… సభా ప్రాంగణానికి కూడా రాకుండా ముందే ఇరువైపులా కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో వేదికపై మంత్రి బాలినేనితో పాటు ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, కరణం వెంకటేష్‌లు మాత్రమే ఆశీనులయ్యారు. అనంతరం కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆధ్వర్యంలో పేద లబ్దిదారులకు ఇళ్ళ స్థలాలను మంత్రి బాలినేని పంపిణీ చేశారు.

ఇటీవల మత్స్యకారుల మధ్య గొడవల్లో కరణం, ఆమంచి అనుచరులు ఆధిపత్య పోరు ప్రదర్శించారు. మత్స్యకారుల మద్య వలల విషయంలో చోటు చేసుకున్న వివాదం ఒకేపార్టీకి చెందిన ఇద్దరు రాజకీయ నేతల మధ్య ఆధిపత్య పోరుతో రాజకీయ రంగు పులుముకోవడంతో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ రంగంలోకి దిగారు. అయితే మోపిదేవి సమక్షంలోనే చీరాలలో ఇటు కరణం, అటు ఆమంచి వర్గీయులు మళ్ళీ ఘర్షణలు పడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరింది. అయితే ప్రభుత్వం చేపట్టిన పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమంలో మళ్ళీ అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరుతో ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో ట్రబుల్‌ షూటర్‌గా మంత్రి బాలినేని శ్రీనువాసులురెడ్డి రంగంలోకి దిగారు. చీరాలలో ఒకే వేదికపై అటు ఎమ్మెల్యే కరణం బలరాం, ఇటు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లను కూర్చోబెట్టుకుని కార్యక్రమాన్ని విజయవంతంగా ఎలాంటి గొడవలు లేకుండా నడిపించారు. ఈ ఘట్టాన్ని చూసిన ఇరువైపుల కార్యకర్తలు హమ్మయ్య అనుకుని ఊపిరిపీల్చుకున్నారు. అయితే మంత్రి బాలినేని ఉన్నారు కాబట్టి ఇద్దరు నేతలు కడుపులో కత్తులు పెట్టుకుని పైకి కౌగిలించుకున్నట్టున్నారు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలినేని సమక్షంలో ఒకే వేదికపై ఇద్దరూ కలిసి ఉన్నా ఎడమొహం, పెడమొహంగానే వ్యవహరించారు.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు