AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘విజేత’ బ్రాంచ్‌ను ప్రారంభించిన మైహోం చైర్మన్

హైదరాబాద్ మియాపూర్ లో విజేత సూపర్ మార్కెట్ 55వ బ్రాంచ్ ప్రారంభమైంది. మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు గారు కొత్త బ్రాంచ్ ను ప్రారంభించారు. నగరంలో ఒక్క స్టార్ తో ప్రారంభించి ఇవాళ 55 స్టోర్లు ఓపెన్ చేసే స్థాయికి విజేత సూపర్ మార్కెట్ సంస్థ యజమాని సుధాకర్ రావు ఎదిగారన్నారు జూపల్లి రామేశ్వరరావు గారు. పదేళ్లుగా వ్యాపారరంగంలో నిలదొక్కుకోడానికి సుధాకర్ రావు పడిన శ్రమ నిబద్ధత ఎంతో గొప్పవన్నారు. పోటీ బాగా ఉన్నప్పటికీ వినియోగదారులను […]

'విజేత' బ్రాంచ్‌ను ప్రారంభించిన మైహోం చైర్మన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 01, 2020 | 6:10 PM

Share

హైదరాబాద్ మియాపూర్ లో విజేత సూపర్ మార్కెట్ 55వ బ్రాంచ్ ప్రారంభమైంది. మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు గారు కొత్త బ్రాంచ్ ను ప్రారంభించారు. నగరంలో ఒక్క స్టార్ తో ప్రారంభించి ఇవాళ 55 స్టోర్లు ఓపెన్ చేసే స్థాయికి విజేత సూపర్ మార్కెట్ సంస్థ యజమాని సుధాకర్ రావు ఎదిగారన్నారు జూపల్లి రామేశ్వరరావు గారు. పదేళ్లుగా వ్యాపారరంగంలో నిలదొక్కుకోడానికి సుధాకర్ రావు పడిన శ్రమ నిబద్ధత ఎంతో గొప్పవన్నారు. పోటీ బాగా ఉన్నప్పటికీ వినియోగదారులను సంతృప్తి పరుస్తూ వాళ్ళ నమ్మకాన్ని పెంచుతూ సుధాకరరావు గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారన్నారు. సేంద్రియ కూరగాయలను కూడా అందుబాటులోకి తేవాలని రామేశ్వరరావు గారు సూచించారు.