AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుపతికి మోదీ గిఫ్ట్.. ఏంటంటే?

టెంపుల్ సిటీ తిరుపతి బంపర్ గిఫ్ట్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టెంపుల్ సిటీకి తరచూ వీఐపీలు వస్తూ, పోతూ వుండడంతో ఎయిర్‌పోర్టుకు కొత్త హంగులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ భేటీ నిర్ణయించింది. బుధవారం మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. తిరుపతి ఎయిర్‌పోర్టు కు కొత్త హంగులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రేణిగుంటలోని తిరుపతి విమానాశ్రయంలో కొత్తగా వీఐపీ సెర్మోనియల్ లాంజ్ […]

తిరుపతికి మోదీ గిఫ్ట్.. ఏంటంటే?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Nov 27, 2019 | 1:46 PM

Share

టెంపుల్ సిటీ తిరుపతి బంపర్ గిఫ్ట్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టెంపుల్ సిటీకి తరచూ వీఐపీలు వస్తూ, పోతూ వుండడంతో ఎయిర్‌పోర్టుకు కొత్త హంగులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ భేటీ నిర్ణయించింది.

బుధవారం మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. తిరుపతి ఎయిర్‌పోర్టు కు కొత్త హంగులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రేణిగుంటలోని తిరుపతి విమానాశ్రయంలో కొత్తగా వీఐపీ సెర్మోనియల్ లాంజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం అవసరమైన ఎయిర్‌పోర్టు భూమిని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది కేంద్ర కేబినెట్. ఎయిర్‌పోర్టు పరిధిలోని 1800 చదరపు మీటర్ల భూమిని భారత విమానాశ్రయాల ప్రాదికార సంస్థ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఏపీ కార్పొరేషన్‌కు లీజుకు ఇవ్వనుంది. ఇందుకు గాను ఏడాదికి కేవలం ఒక్క రూపాయి నామమాత్రపు లీజు ఫీజు చెల్లించాలని కేబినెట్ నిర్దేశించింది.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు భూమి ఏపీ కార్పొరేషన్‌కు బదిలీ కాగానే వీఐపీ సెర్మోనియల్ లాంజ్ నిర్మాణం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ మధ్య కాలంలో తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అప్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ్నించి కొలంబో, దుబాయ్, కౌలాలంపూర్‌లకు విమానాలు నడుస్తున్నాయి. దానికితోడు జాతీయ, అంతర్జాతీయ స్థాయి వీఐపీలు ఈ మధ్య తరచూ తిరుపతికి శ్రీవారి దర్శనం కోసం వచ్చి, వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు ఆవరణలో సెర్మోనియల్ లాంజ్‌ అవసరమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. దానికి అనుుణంగానే కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది.