AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంగోలులో కీచక పర్వం..మైనర్ బాలికపై

ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. ఐదురోజులపాటు బాలికను నిర్భందించి అమానవీయంగా అత్యాచారం చేశారు. ఎలాగోలా వారినుంచి బయటపడ్డ బాలిక ఒంగోలు ఔట్ పోస్ట్ పోలీసుల దగ్గరకి చేరుకుని విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. గుంటూరు నల్లచెరువుకు చెందిన బాలిక విజయవాడ హాస్టల్‌లో చదువుతోంది. ఆమెకు ఒంగోలుకు చెందిన కారు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడికోసం ఆమె ఒంగోలు వచ్చింది. రాత్రి 7.00 […]

ఒంగోలులో కీచక పర్వం..మైనర్ బాలికపై
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 23, 2019 | 3:47 PM

Share

ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. ఐదురోజులపాటు బాలికను నిర్భందించి అమానవీయంగా అత్యాచారం చేశారు. ఎలాగోలా వారినుంచి బయటపడ్డ బాలిక ఒంగోలు ఔట్ పోస్ట్ పోలీసుల దగ్గరకి చేరుకుని విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

గుంటూరు నల్లచెరువుకు చెందిన బాలిక విజయవాడ హాస్టల్‌లో చదువుతోంది. ఆమెకు ఒంగోలుకు చెందిన కారు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడికోసం ఆమె ఒంగోలు వచ్చింది. రాత్రి 7.00 గంటలకు బస్టాండ్‌కు చేరుకున్న ఆమె దగ్గర ఫోన్ లేకపోవడంతో బాజి అనే వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకుని ఫోన్ చేసింది. అయితే ఎంత సేపటికీ ఫోన్ కలవకపోవడంతో రాత్రి 10.00 గంటల వరకూ ఒంగోలు బస్టాండ్‌లోనే ఉండిపోయింది. దీంతో ఆ బాలికపై బాజి కన్నేశాడు. ప్రియుడి దగ్గరకు చేరుస్తానంటూ నమ్మించాడు. ఆ తర్వాత తన స్నేహితుడు శ్రీకాంత్‌తో కలిసి బాలికను నలుగురు విద్యార్ధులు ఉన్న గదికి తీసుకెళ్లి నిర్భంధించి వారం రోజుల పాటు పైశాచికత్వాన్ని ప్రదర్శించారు.

బాలిక ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆరుగురు  నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలిని వైద్య సేవల నిమిత్తం ఒంగోలు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. నిందితులపై అవసరం అయితే షీట్స్ కూడా ఓపెన్ చేస్తామని ఎస్పీ సిద్దార్ద్ కౌసల్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి ఎస్సీతో మాట్లాడారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.   బాలికపై దారుణానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని కమిషన్ సభ్యురాలు రమాదేవి తెలిపారు.

Follow Us
వేసవిలో మజ్జిగ ఎక్కువగా తాగుతున్నారా? ఎవరు-ఎలా, ఎంత తీసుకోవాలంటే
వేసవిలో మజ్జిగ ఎక్కువగా తాగుతున్నారా? ఎవరు-ఎలా, ఎంత తీసుకోవాలంటే
సిరిసంపదలను ఇచ్చే కేతు పర్వతం...! మీ చేతిలో ఎక్కడ, ఎలా ఉంటుందంటే
సిరిసంపదలను ఇచ్చే కేతు పర్వతం...! మీ చేతిలో ఎక్కడ, ఎలా ఉంటుందంటే
హోలీ దావత్.. నోరూరించే స్పెషల్ గుడాలు.. 10 నిమిషాల్లో ఇలా చేయండి
హోలీ దావత్.. నోరూరించే స్పెషల్ గుడాలు.. 10 నిమిషాల్లో ఇలా చేయండి
రెస్టారెంట్‌లో సర్వీస్ ఛార్జ్ ఖచ్చితంగా చెల్లించాల్సిందేనా..?
రెస్టారెంట్‌లో సర్వీస్ ఛార్జ్ ఖచ్చితంగా చెల్లించాల్సిందేనా..?
అబ్బో.. తెలివిమీరిన దొంగలు.. పోలీసులకే సవాల్.. ఏం చేశారో తెలుసా?
అబ్బో.. తెలివిమీరిన దొంగలు.. పోలీసులకే సవాల్.. ఏం చేశారో తెలుసా?
వాళ్లు సర్వనాశనం అవుతారు..
వాళ్లు సర్వనాశనం అవుతారు..
బాలకృష్ణను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఎవరికి దక్కనుంది
బాలకృష్ణను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఎవరికి దక్కనుంది
IND vs WI మ్యాచ్‌లో ఏకంగా 13 భారీ రికార్డులు.. లిస్ట్ చూస్తే..
IND vs WI మ్యాచ్‌లో ఏకంగా 13 భారీ రికార్డులు.. లిస్ట్ చూస్తే..
మంచిదని ఫుల్లుగా తాగుతున్నారా..? డైరెక్టుగా కిడ్నీలే పోతాయ్..
మంచిదని ఫుల్లుగా తాగుతున్నారా..? డైరెక్టుగా కిడ్నీలే పోతాయ్..
వివేక్ ఆత్రేయపై హీరో శ్రీవిష్ణు సంచలన కామెంట్లు
వివేక్ ఆత్రేయపై హీరో శ్రీవిష్ణు సంచలన కామెంట్లు