మరో 24 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

|

Nov 11, 2020 | 10:11 PM

హైదరాబాద్ నగరంలోని బస్తీవాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాలకు శ్రీకారం చుట్టింది. గత నెలలో కొన్ని దవాఖానాలకు ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు మరికొన్నింటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

మరో 24 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
Follow us on

Basti Dawakhanas : హైదరాబాద్ నగరంలోని బస్తీవాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాలకు శ్రీకారం చుట్టింది. గత నెలలో కొన్ని దవాఖానాలకు ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు మరికొన్నింటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డివిజన్‌కు రెండు చొప్పున 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీలో అధికారులు ఇప్పటికే 200 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. వీటికితోడు మరో 24 బస్తీ దవాఖానాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించనున్నారు.

రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖతో కలిసి నగరంలోని నిరుపేదలు అధికంగా నివసించే మురికివాడలు, బస్తీలలో జీహెచ్‌ఎంసీ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసింది. వీటిని మంత్రి కేటీఆర్‌తోపాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ . హోంమంత్రి మహమూద్‌అలీ, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించనున్నారు.