రైతులను ఇబ్బంది పెడితే షాపులు సీజ్ చేయండి…

|

Aug 25, 2020 | 7:43 PM

అధిక ధరలకు ఎరువులు అమ్మితే షాపులను సీజ్‌ చేయిస్తామని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. ధరల పట్టిక సూచికను ప్రదర్శించకపోయినా రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చినా వెంటనే ఆ దుకాణాలపై దాడులు చేసి...

రైతులను ఇబ్బంది పెడితే షాపులు సీజ్ చేయండి...
Follow us on

అధిక ధరలకు ఎరువులు అమ్మితే షాపులను సీజ్‌ చేయిస్తామని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. ధరల పట్టిక సూచికను ప్రదర్శించకపోయినా రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చినా వెంటనే ఆ దుకాణాలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా..  షాపుల యజమానులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

పాలకుర్తిక్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సంబందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్నారన్నవిషయంపై మంత్రి ఆగ్రహం వ్యాక్తం చేశారు. రాష్ట్రంలోని అనేక చోట్ల ఎరువులు, పరుగుల మందులు అధిక ధరలకు అమ్ముతున్నట్టు తన దృష్టికి వచ్చిందని మంత్రి  అన్నారు.

కొందరు యజమానులు రసాయనాలు, పరుగుల మందులు, గుళికలు కొంటేనే యూరియా ఇస్తామని నిబంధనలు పెట్టడం ఇది సరైన పద్దతి కాదని అన్నారు. ఆధార్‌ కార్డు కావాలంటూ నానా రకాలుగా వేధిస్తున్నట్టు కూడా దన దృష్టికి వచ్చిందని.. ఇలా చర్యలకు దిగితే తగిన చర్యలు ఉంటాయని అన్నారు. ఇలాంటి వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.