మావోల మరో దుశ్చర్య.. పంచాయితీ కార్యాలయం పేల్చివేత

| Edited By: Srinu

May 19, 2019 | 7:05 PM

ఏవోబీలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మల్కాన్‌గిరి జిల్లా కిముడుపల్లి పంచాయితీ కార్యాలయాన్ని వారు పేల్చేశారు. శుక్రవారం రాత్రి సమయంలో ఈ దాడికి వారు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కార్యాలయం చుట్టూ 30 నుంచి 40 పేలుడు పదార్థాలను అమర్చి ఈ పేలుడును చేశారని వారు గుర్తించారు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు చేరుకోగా.. అప్పటికే కార్యాలయం పేలినట్లు వారు తెలిపారు. ఇక ఆ ప్రదేశంలో మావోయిస్ట్ లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ […]

మావోల మరో దుశ్చర్య.. పంచాయితీ కార్యాలయం పేల్చివేత
Follow us on

ఏవోబీలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మల్కాన్‌గిరి జిల్లా కిముడుపల్లి పంచాయితీ కార్యాలయాన్ని వారు పేల్చేశారు. శుక్రవారం రాత్రి సమయంలో ఈ దాడికి వారు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కార్యాలయం చుట్టూ 30 నుంచి 40 పేలుడు పదార్థాలను అమర్చి ఈ పేలుడును చేశారని వారు గుర్తించారు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు చేరుకోగా.. అప్పటికే కార్యాలయం పేలినట్లు వారు తెలిపారు. ఇక ఆ ప్రదేశంలో మావోయిస్ట్ లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో పోలీసులు అలర్ట్ అయ్యారు.