యూపీలో ట్రక్కు బస్సు ఢీ.. మంటల్లో చిక్కుకున్న 50 మంది ప్రయాణికులు!

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో విషాదం చోటుచేసుకుంది. జిటి రోడ్‌లోని గిలోయ్ గ్రామ సమీపంలో ఒక ప్రైవేట్ బస్సు, ట్రక్ ఢీకొన్నాయి. దీంతో అకస్మాత్తుగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు కన్నౌజ్ నుండి జైపూర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ డిఎం, […]

యూపీలో ట్రక్కు బస్సు ఢీ.. మంటల్లో చిక్కుకున్న 50 మంది ప్రయాణికులు!

Edited By:

Updated on: Jan 11, 2020 | 5:02 AM

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో విషాదం చోటుచేసుకుంది. జిటి రోడ్‌లోని గిలోయ్ గ్రామ సమీపంలో ఒక ప్రైవేట్ బస్సు, ట్రక్ ఢీకొన్నాయి. దీంతో అకస్మాత్తుగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు కన్నౌజ్ నుండి జైపూర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ డిఎం, ఇతర అధికారులను సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.

[svt-event date=”11/01/2020,1:36AM” class=”svt-cd-green” ]

[svt-event date=”10/01/2020,10:57PM” class=”svt-cd-green” ]

Follow Us