AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ యాప్ డేంజర్ అంటున్న సైబర్ సెక్యూరిటీ..!

టిక్‌టాక్‌ కి పోటీగా చైనా సరికొత్త యాప్ మిత్రోను ప్రవేశపెట్టింది. చైనా అప్లికేషన్లను నిషేధించాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు. ఇందులోని ఖాతాలను హ్యాకర్లు సులభంగా హ్యాక్ చేసే అవకాశం ఉందన్న మహారాష్ట్ర సైబర్ సెక్యూరిటీ సంస్థ .

ఆ యాప్ డేంజర్ అంటున్న సైబర్ సెక్యూరిటీ..!
Balaraju Goud
| Edited By: |

Updated on: Jun 04, 2020 | 5:48 PM

Share

టిక్‌టాక్‌ ఈ యాప్ కి అలవాటు పడనివారు ఉండరంటే నమ్మండీ..! ఒక్కసారి ఫాలో అయితే ఇక అంతే.. సామాన్యుడి నుంచి సెలబ్రేటీల దాకా ప్రతి ఒక్కరు అడిక్ట్ అవుతున్నారు. భాష ఏదైనా భావం ఒక్కటే అన్నట్లు హావభావాలు ప్రదర్శిస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. ఇంతటి ఆదరణ ఉన్న ఆ యాప్ కి పోటీగా చైనా సరికొత్త సరికొత్త యాప్ మిత్రోను ప్రవేశపెట్టింది. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే చైనా అప్లికేషన్లను నిషేధించాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యెక్తమవుతున్నాయి. ఈ అప్లికేషన్‌ను పాకిస్తాన్‌లోని టిక్ టిక్ అనే అప్లికేషన్‌తో సోర్స్‌కోడ్ సాయంతో రూపొందించినట్లు భావిస్తున్నారు టెక్నికల్ నిపుణులు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేక దృష్ట్యా మహారాష్ట్ర సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ అప్లికేషన్‌ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసేయాల్సిందిగా ప్రజలను హెచ్చరిస్తోంది. ఈ అప్లికేషన్‌ను వినియోగించడం వల్ల వ్యక్తికగ సమాచారం చోరీ అయ్యే ప్రమాదముందంటోంది. అంతేకాక, ఇందులోని ఖాతాలను హ్యాకర్లు సులభంగా హ్యాక్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఈ యాప్ కి సంబంధించిన అప్లికేషన్‌ను వెంటనే తమ మొబైల్ నుంచి తీసివేయాలని సూచిస్తున్నారు అధికారులు.