AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా ఉధృతి

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆ రాష్ట్రంలో శుక్రవారం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
Balaraju Goud
|

Updated on: Jul 24, 2020 | 9:34 PM

Share

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆ రాష్ట్రంలో శుక్రవారం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్క రోజే 9,615 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 278 మంది బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,57,117కి చేరుకోగా.. మరణాల సంఖ్య 13,132కి చేరుకుంది.

మహారాష్ట్రలో ప్రస్తుతం 1,36,980 మంది కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శుక్రవారం 5,714 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇప్పటివరకు 1,99,967 మంది డిశ్చార్జ్. మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని వెల్లడించింది.