AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొండపై నుంచి దూకేందుకు యత్నం.. కొడుకును కాపాడేందుకు వెళ్లి తల్లిదండ్రులు సైతం మృతి..!

ఛత్రపతి సంభాజీనగర్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ గొడవతో ఆత్మహత్యకు ప్రయత్నించిన కుమారుడిని రక్షించే ప్రయత్నంలో తల్లిదండ్రులు సైతం కొండపై నుంచి దూకారు. ఈ సంఘటనలో కునాల్, అతని తల్లిదండ్రులు మురళీధర్, సంగీత ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కొండపై నుంచి దూకేందుకు యత్నం.. కొడుకును కాపాడేందుకు వెళ్లి తల్లిదండ్రులు సైతం మృతి..!
Chhatrapati Sambhajinagar Tragedy
Balaraju Goud
|

Updated on: Aug 21, 2026 | 6:47 PM

Share

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న కుమారుడిని కాపాడేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తిస్‌గావ్ ప్రాంతంలోని ఖవద్య కొండల వద్ద గురువారం (ఆగస్టు 20) ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జల్తా ఫాటా ప్రాంతానికి చెందిన కునాల్ మురళీధర్ చంద్‌గుడే (19) మొబైల్ ఫోన్ విషయంలో తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. అనంతరం ఉదయం సుమారు 10 గంటల సమయంలో కొండపైకి వెళ్లాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కునాల్‌ను కిందకు తీసుకురావడానికి అతని తల్లి సంగీత, తండ్రి మురళీధర్‌తో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక సర్పంచ్, గ్రామస్తులు ప్రయత్నించారు.

లోతైన లోయకు ఎదురుగా ఉన్న ప్రమాదకరమైన రాతి దిబ్బపై కునాల్ నిలబడటంతో దాదాపు మూడు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అతడిని ఒప్పించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒక దశలో స్థానిక సర్పంచ్ కునాల్‌ను కిందకు తీసుకురావడానికి ఐఫోన్ ఇస్తానని కూడా చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ అతడు వెనక్కి తగ్గలేదు.

చివరకు కునాల్ కొండపై నుంచి కిందకు దూకాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి మురళీధర్ కూడా వెంటనే దూకడంతో ఇద్దరూ లోయలో పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. భర్త, కుమారుడు కిందపడటాన్ని చూసిన తల్లి సంగీత తీవ్ర భయాందోళనకు గురై ఆమె సైతం కొండపై నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..