గుడ్ న్యూస్.. ఇకపై కరోనా టెస్టులు మరింత చౌక!
కరోనా బాధితులను గుర్తించడానికి నిర్వహించే పరీక్షలకు ఆలస్యం అవుతోంది. కరోనా టెస్టుల ఫలితాలు మరింత జాప్యమవుతోంది. ఇకపై ఈ పరిస్థితి ఉండబోదు. ఎందుకంటే.. చవక ధరకే కరోనా టెస్టు కిట్లు అందుబాటులోకి రానున్నాయి.

కరోనా బాధితులను గుర్తించడానికి నిర్వహించే పరీక్షలకు ఆలస్యం అవుతోంది. కరోనా టెస్టుల ఫలితాలు మరింత జాప్యమవుతోంది. ఇకపై ఈ పరిస్థితి ఉండబోదు. ఎందుకంటే.. చవక ధరకే కరోనా టెస్టు కిట్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు.. కేవలం గంట వ్యవధిలోనే కచ్చితమైన ఫలితాలను అందిస్తాయి.
కాగా.. ఈ చవక ధర కరోనా టెస్టు కిట్లు మరో నాలుగు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఫెలూదా అనే ఈ టెస్టింగ్ పాలసీలో కొవిడ్-19ను నిర్ధారించేందుకు సుమారు రూ.500 ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ విధానాన్ని ఢిల్లీలోని కౌన్పిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (CSIR-IGRB)లో సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ దేబొజ్యోతి చక్రవర్తి, డాక్టర్ సౌవిక్ మైతీ ఈ టెస్టు కిట్లను కనిపెట్టారు.
మరోవైపు.. ఫెలూదా విధానంలో కొవిడ్-19 వ్యాధి కారకమైన SARS-COV2 వైరస్ జన్యు నిర్మాణాన్ని గుర్తించి నిర్మూలించేందుకు CRI SPR GN ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దేశంలో కరోనా పరీక్షా విధానానికి ఈ తరహా టెక్నాలజీని వాడటం ఇదే తొలిసారి కావడం విశేషం. మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు టాటా సన్స్ సంస్థకు అనుమతి లభించింది. ఈ కరోనా పరీక్షా విధానం పూర్తి పేరు – FNCAS9 ఎడిటర్ లింక్డ్ యూనిఫార్మ్ డిటెక్షన్.. సింపుల్గా ‘ఫెలూదా’ అని పిలుస్తున్నారు.



