కేంద్రంపై కేటీఆర్ ధ్వజం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు తెలంగాణ మునిసిపల్ మంత్రి కే.తారక రామారావు. రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు.

కేంద్రంపై కేటీఆర్ ధ్వజం
Follow us

|

Updated on: Nov 01, 2020 | 1:28 PM

KTR blames Central Government: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు తెలంగాణ మునిసిపల్ మంత్రి కే.తారక రామారావు. రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. కేంద్రానికి తెలంగాణ నుంచి పోయే పన్నుల్లో సగం మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, మరోవైపు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న నిధులకు సంబంధించి పలు అంశాలపైన మంత్రి కే. తారకరామారావు ఆదివారం తన ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో సగం మాత్రమే తెలంగాణకు తిరిగి వస్తున్నాయని ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల 75 వేల 926 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం టాక్సుల రూపంలో తెలంగాణ నుంచి తీసుకుందని, అదే సమయంలో కేవలం లక్షా 40 వేల 329 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చిందని మంత్రి కేటీఆర్ వివరించారు.

తెలంగాణ రాష్ట్ర జీ.ఎస్.డీ.పీ.,తలసరి ఆదాయం సైతం భారీగా పెరిగిందని, ముఖ్యంగా కీలకమైన రంగాల్లో పెట్టుబడులతో పాటు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసిన మూలధన వ్యయం ఫలితంగానే ఇది సాధ్యమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించి అప్పులు, జీఎస్‌డీపీ రేషియో 22.8 శాతంగా ఉన్నదన్నారు. దేశంలో రుణాలు, జీఎస్‌డీపీ రేషియో తక్కువ కలిగిన ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సమ్మిళితమైనదని, ముఖ్యంగా వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్ వంటి అన్ని రంగాల్లోనూ వృద్ధి కొనసాగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2014- 2020 మధ్యలో భారతదేశ తలసరి ఆదాయం 54.9 శాతంగా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం భారీగా పెరిగి 83.9 శాతంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

ALSO READ: పోలవరం ప్రొగ్రెస్ మా ఘనతే: చంద్రబాబు

ALSO READ: బీజేపీకి రావుల గుడ్‌బై.. కమలానికి షాక్

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?