AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో కొరియన్ కంపెనీ భారీ పెట్టుబడులు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొరియా దుస్తుల కంపెనీ యంగోన్ కార్పొరేషన్ తో తుది ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ .900 కోట్లు. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ (కెఎమ్‌టిపి) లో ఈ పెట్టుబడులు పెట్టడానికి కొరియన్ కంపెనీ సిద్ధంగా ఉంది. ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు, కొరియా భారత రాయబారి శ్రీప్రియా రంగనాథన్, భారతదేశంలోని కొరియా రాయబారి షిన్ బొంగ్‌కిల్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. యంగోన్ కార్పొరేషన్ వరంగల్ లో […]

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో కొరియన్ కంపెనీ భారీ పెట్టుబడులు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 12, 2019 | 3:45 AM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొరియా దుస్తుల కంపెనీ యంగోన్ కార్పొరేషన్ తో తుది ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ .900 కోట్లు. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ (కెఎమ్‌టిపి) లో ఈ పెట్టుబడులు పెట్టడానికి కొరియన్ కంపెనీ సిద్ధంగా ఉంది. ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు, కొరియా భారత రాయబారి శ్రీప్రియా రంగనాథన్, భారతదేశంలోని కొరియా రాయబారి షిన్ బొంగ్‌కిల్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.

యంగోన్ కార్పొరేషన్ వరంగల్ లో 290 ఎకరాల విస్తీర్ణంలో తమ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుంది. అక్కడ ప్రధానంగా ఎగుమతుల కోసం.. దుస్తులు, ఇతర  వస్త్ర ఉత్పత్తులను తయారు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 12,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుంది. యుఎస్, స్విట్జర్లాండ్‌, బంగ్లాదేశ్, వియత్నాం, ఇథియోపియాతో సహా 13 దేశాలలో యంగోన్ గ్రూప్ కు కార్యాలయాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా యంగోన్ కార్పొరేషన్ కార్యాలయాల్లో 90 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు.