AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కొడాలి నాని, ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదని ప్రకటన

ఏపీ సర్కార్ రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ డీలర్లను తొలగిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు సర్కులేట్ అయిన విషయం తెలిసిందే.

ఏపీ రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కొడాలి నాని,  ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదని ప్రకటన
Ram Naramaneni
|

Updated on: Nov 30, 2020 | 7:39 AM

Share

ఏపీ సర్కార్ రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ డీలర్లను తొలగిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు సర్కులేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలన్నీ అవాస్తమని, అలాంటి ఉద్దేశం జగన్ సర్కారుకు లేనది పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లడిన మంత్రి పలు పలు అంశాలు వెల్లడించారు. గత ప్రభుత్వాల కంటే మెరుగైన నాణ్యత ఉన్న బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని, పేద ప్రజలు తినే రేషన్‌ బియ్యంలో సమూల మార్పులు తెచ్చామని మంత్రి వెల్లడించారు.

ఈ నిర్ణయతో గవర్నమెంట్‌పై రూ. 350 కోట్ల భారం పడ్డా పేదలకు అందించే బియ్యం విషయంలో రాజీ పడలేదన్నారు. అలాగే కోవిడ్ వ్యాప్తి సమయంలో ప్రజలపై భారం పడకుండా రేషన్ డీలర్లకు రూ. 22 కోట్లు కమీషన్‌ రూపంలో ప్రభుత్వమే ఇచ్చిందని స్పష్టం చేశారు. రేషన్ డీలర్లను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, వారికి ఇవ్వాల్సిన బకాయిలు కూడా త్వరలోనే చెల్లిస్తామని కొడాలి నాని తెలిపారు

రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్ డీలర్లను తొలగిస్తారనే వార్తలు సర్కులేట్ అయ్యాయి. సరుకులను గ్రామ, వార్డు వాలంటీర్లే ప్రతి ఇంటికి వెళ్లి డోర్ డెలివరీ చేస్తారని సీఎం జగన్ ప్రకటించడంతో రేషన్ డీలర్ల వ్యవస్థ రద్దు అవుతుందని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో రేషన్ డీలర్లను తొలగించడం లేదని మంత్రి కొడాలి నాని చెప్పడంతో..వారికి ఊరట లభించింది.

Also Read :

AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !

Ind vs Aus : రెండో వన్డే​లో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు