Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2,533కి చేరిన కర్ణాటక కరోనా పాజిటివ్ కేసులు

కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇవాళ కొత్తగా 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2533కు చేరుకుంది. వీటిలో ఇప్పటివరకు 834 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. 1650 యాక్టివ్ కేసులతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనాతో 47 మంది మృతి చెందినట్లు కర్ణాటక వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం దేశంలో వైరస్ ప్రభావం […]

2,533కి చేరిన కర్ణాటక కరోనా పాజిటివ్ కేసులు
Follow us
Balaraju Goud

|

Updated on: May 28, 2020 | 8:43 PM

కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇవాళ కొత్తగా 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2533కు చేరుకుంది. వీటిలో ఇప్పటివరకు 834 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. 1650 యాక్టివ్ కేసులతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనాతో 47 మంది మృతి చెందినట్లు కర్ణాటక వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం దేశంలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి వచ్చే రవాణాను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇక విదేశాల నుంచి వచ్చే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.