AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటకలో ఒక్కరోజే 5వేలకు పైగా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా ఒక్కరోజే 5వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా 100కు చేరుకుంది. ఇక ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 81వేలకు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కర్ణాటకలో ఒక్కరోజే 5వేలకు పైగా కేసులు
Telangana Coronavirus
Balaraju Goud
|

Updated on: Jul 23, 2020 | 9:20 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా ఒక్కరోజే 5వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా 100కు చేరుకుంది. ఇక ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 81వేలకు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో కేవలం 5,030 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ 2,071 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80,863కు చేరింది. ప్రస్తుతం 49,931 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, కరోనా నుంచి కోలుకుని 29,310 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా మొత్తంగా ఇప్పటికీ 1,616 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులలో కేవలం బెంగళూరు అర్బన్‌లోనే 2,207 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.