AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే 29న సీఎం కేసీఆర్, చిన్నజీయర్‌ స్వామి చేతుల మీదుగా కొండపొచమ్మ సాగర్ ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. గోదావరి జలాలు చివరగా కొండపొచమ్మ సాగర్ కి చేరడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికానుంది. మే 29న కొండపోచమ్మ జలాశయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మే 29న ఉదయం 11:30 గంటలకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా కొండ పోచమ్మ జలాశయంలోకి […]

మే 29న సీఎం కేసీఆర్, చిన్నజీయర్‌ స్వామి చేతుల మీదుగా కొండపొచమ్మ సాగర్ ప్రారంభం
Balaraju Goud
|

Updated on: May 26, 2020 | 3:45 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. గోదావరి జలాలు చివరగా కొండపొచమ్మ సాగర్ కి చేరడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికానుంది. మే 29న కొండపోచమ్మ జలాశయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మే 29న ఉదయం 11:30 గంటలకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా కొండ పోచమ్మ జలాశయంలోకి నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొండ పోచమ్మ ఆలయంలో చిన్నజీయర్‌ స్వామితో కలిసి సీఎం కేసీఆర్‌ హోమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. కొండపోచమ్మ సాగర్‌ ను పరిశీలించిన హరీష్.. ప్రభుత్వం సూచించిన పంటలను రైతులు సాగు చేసి.. అధిక దిగుబడి సాధించాలన్నారు మంత్ర హరీష్. వ్యవసాయ దండగ కాదు.. వ్యవసాయం పండగ అని అనిపించాలనేది కేసీఆర్ కళ అన్నారు హరీష్ రావు.