చికిత్స పొందుతూ.. లోకో పైలట్ చంద్రశేఖర్‌ మృతి

ఇటీవల హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన ఎంఎంటీఎస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్ చంద్రశేఖర్ మృతిచెందారు. ఈ నెల 11వ తేదీన ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో హంద్రీనీవా ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చంద్రశేఖర్ ట్రైన్ ఇంజిన్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అయితే అధికారులు కొన్ని గంటలపాటు శ్రమించి ఆయన్ను బయటకు తీశారు. అనంతరం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అయిదు రోజుల నుంచి కేర్ ఆస్పత్రిలో […]

చికిత్స పొందుతూ.. లోకో పైలట్ చంద్రశేఖర్‌ మృతి

Updated on: Nov 16, 2019 | 11:37 PM

ఇటీవల హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన ఎంఎంటీఎస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్ చంద్రశేఖర్ మృతిచెందారు. ఈ నెల 11వ తేదీన ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో హంద్రీనీవా ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చంద్రశేఖర్ ట్రైన్ ఇంజిన్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అయితే అధికారులు కొన్ని గంటలపాటు శ్రమించి ఆయన్ను బయటకు తీశారు. అనంతరం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అయిదు రోజుల నుంచి కేర్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఉండగా.. కాసేపటి క్రితం తుదిశ్వాస విగడిచాడు. కాగా, రెండు రోజుల క్రితమే అతడి కాలుకు గాయమవ్వడంతో ట్రీట్‌మెంట్‌ చేసి కాలును తొలగించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us