చంద్రబాబుకు నేనంటే భయం – కేఏ పాల్
ఏపీలో జరిగిన ఎన్నికల్లో తాము గెలుస్తామన్న నమ్మకం లేదని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ మాకు సింబల్ ను లేట్ గా ఇచ్చారని.. ఫ్యాన్ సింబల్ రాకుండా బీజేపీ, వైసీపీ అడ్డు పడ్డాయని’ ఆరోపించారు. అన్ని పార్టీలూ ఓటర్లకు డబ్బులు పంచారని.. కానీ తాము ఎవ్వరికీ డబ్బు పంచలేదని స్పష్టం చేశారు. రూ.200 కోట్లు ఖర్చు చేసినట్టు ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తనకు చెప్పారని పాల్ వెల్లడించారు. […]
ఏపీలో జరిగిన ఎన్నికల్లో తాము గెలుస్తామన్న నమ్మకం లేదని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ మాకు సింబల్ ను లేట్ గా ఇచ్చారని.. ఫ్యాన్ సింబల్ రాకుండా బీజేపీ, వైసీపీ అడ్డు పడ్డాయని’ ఆరోపించారు. అన్ని పార్టీలూ ఓటర్లకు డబ్బులు పంచారని.. కానీ తాము ఎవ్వరికీ డబ్బు పంచలేదని స్పష్టం చేశారు. రూ.200 కోట్లు ఖర్చు చేసినట్టు ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తనకు చెప్పారని పాల్ వెల్లడించారు. పార్టీలకతీతంగా తనను అభిమానిస్తున్నందుకు కేఏ పాల్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు నాయుడుకు తానంటే భయమని.. 2014 వరకు చంద్రబాబు తనను చూసి భయపడేవాడని కేఏ పాల్ వెల్లడించారు. అంతేకాదు అటు ఈవీఎంల మీద ముందు తానే మాట్లాడానని చెప్పారు.