AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ పర్యటన, నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు అండ

నివర్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. 2వతేదీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు..

నేడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ పర్యటన, నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు అండ
Venkata Narayana
|

Updated on: Dec 02, 2020 | 4:55 AM

Share

నివర్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. 2వతేదీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పవన్ పర్యటన సాగుతుంది. తుఫాను వల్ల నష్టపోయిన రైతులతో పవన్ ఈ సందర్భంగా ముఖాముఖి నిర్వహిస్తారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డలో ఆయన టూర్‌ జరగనుంది. గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు కొలకలూరుల్లో పవన్ పర్యటిస్తారు. 3 వతేదీన తిరుపతి చేరుకుని చిత్తూరుజిల్లాలో పర్యటిస్తారు 4 వతేదీన శ్రీకాళహస్తిలో పవన్ పర్యటన ఉంటుంది. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను పవన్‌ పరామర్శిస్తారు. ఇటీవలి తుఫాన్‌ దెబ్బకు అపార పంటనష్టం వాటిల్లిన ప్రాంతాలను పవన్ స్వయంగా పరిశీలిస్తారు.