కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిని ఉతికి ఆరేశారు

|

Nov 01, 2020 | 9:23 PM

ఉత్తరప్రదేశ్‌లో నడిరోడ్డుపై ఓ నేతను నడిరోడ్డుపై ఇద్దరు మహిళలు చితకబాదారు. జలౌన్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్న అనూజ్‌ మిశ్రాపై దాడి చేశారు ఇద్దరు మహిళలు. ఫోన్లో తమను పదేపదే వేధిస్తున్నాడని...

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిని ఉతికి ఆరేశారు
Follow us on

Sexual Harassment : ఉత్తరప్రదేశ్‌లో నడిరోడ్డుపై ఓ నేతను నడిరోడ్డుపై ఇద్దరు మహిళలు చితకబాదారు. జలౌన్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్న అనూజ్‌ మిశ్రాపై దాడి చేశారు ఇద్దరు మహిళలు. ఫోన్లో తమను పదేపదే వేధిస్తున్నాడని , అందుకే రోడ్డుపై బుద్ది చెప్పినట్టు వాళ్లిద్దరు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు అనూజ్‌ మిశ్రా.. బాకీ డబ్బులు చెల్లించాలని అడిగినందుకే కుట్ర పూరితంగా దాడి చేశారని మండిపడ్డారు.

ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అయ్యింది. తనపై దాడి చేసిన ఇద్దరు మహిళలు కూడా కాంగ్రెస్‌ కార్యకర్తలేనని , సరిగ్గా పనిచేయకపోవడంతో పదవుల నుంచి తొలగించినట్టు చెప్పారు అనూజ్‌ మిశ్రా.