తాజాగా… నలుగురు లేదా ఐదుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు నుంచి వచ్చి, మన దేశ భూభాగంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని క్షేత్ర స్థాయిలోని భద్రతా దళాలకు చేరవేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్, పాక్ దళాల మధ్య భారీగా కాల్పులు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి. పాకిస్థాన్ సైన్యం జరుపుతున్న కాల్పులను ఎదుర్కొనేందుకు భారత సైన్యం బోఫోర్స్ తుపాకులను వాడవలసి వచ్చిందని జమ్మూ-కశ్మీరు గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పారు.