Jagan offer ఏపీ నుంచి వెళ్ళిపోతే ఐదొందలిస్తాం..

|

May 06, 2020 | 4:11 PM

ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలనకునే వారికి అయిదు వందల రూపాయలిస్తామని ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వారిని తిరిగి ఏపీకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

Jagan offer ఏపీ నుంచి వెళ్ళిపోతే ఐదొందలిస్తాం..
Follow us on

ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలనకునే వారికి అయిదు వందల రూపాయలిస్తామని ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వారిని తిరిగి ఏపీకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. వలస కార్మికులు, వారి కుటుంబాల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం సమీక్ష జరిపారు.

సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ వలస కార్మికులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలనుకునే వలస కార్మికులకు ప్రతీ ఒక్కరికీ అయిదు వందల రూపాయల మేరకు ఆర్థిక సాయం ఇస్తామని సీఎం ప్రకటించారు. ఇతర రాష్ట్రాల వలస కార్మికులను ఆదుకునేందుకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రం నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి పూర్తి ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి సూచించిన సీఎం.. వారికి ప్రయాణ సమయంలో ఆర్థిక అవసరాల కోసం 500 రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. అదే సమయంలో ఏపీకి తిరిగి వస్తున్న వలస కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, వారికి, వారి కుటుంబాలకు అవసరమైన క్వారెంటైన్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నెగెటివ్ వచ్చి, క్వారెంటైన్ అవసరం లేని వారికి నిత్యావసరాలు పంపిణీ చేయాలని, ఆర్థిక సాయం కూడా చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.