రోజా ‘రచ్చబండ షో’కు దొరబాబు దంపతులు
జబర్దస్త్ దొరబాబు వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్లో చినికి చినికి గాలివానలో మారింది. ఇప్పుడు ఈ వివాదంతోనే.. ఎమ్మెల్యే, ప్రముఖ నటి జడ్జిగా నిర్వహిస్తోన్న 'రచ్చబండ' షోకు దొరబాబు దంపతులు..
జబర్దస్త్ దొరబాబు వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్లో చినికి చినికి గాలివానలా మారింది. ఇప్పుడు ఈ వివాదంతోనే.. ఎమ్మెల్యే, ప్రముఖ నటి జడ్జిగా నిర్వహిస్తోన్న ‘రచ్చబండ’ షోకు దొరబాబు దంపతులు వెళ్లబోతున్నారట. ఈ ఇష్యూ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.సెక్స్ రాకెట్ ఉదంతంలో జబర్దస్త్ కమెడియన్స్ దొరబాబుతో పాటు పరదేశీ కూడా పోలీసులకి దొరికిపోయారు. ఈ నేపథ్యంలో వీరిపై జబర్దస్త్ టీంతో పాటు కమెడియన్ ఆది సీరియస్ అయినట్టు సమాచారం.
విజయనగరంలో జరిగిన సెక్స్ రాకెట్ ఘటన తర్వాత జబర్దస్త్ కమెడియన్స్ దొరబాబు, పరదేశీ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయారు. ప్రస్తుతం ఇదే ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. ఎక్కడాలేని పుకార్లన్నీ.. ఇప్పుడు ఈ ఘటన చుట్టూ తిరుగుతున్నాయి. మళ్లీ వీరు జబర్దస్త్లోకి రారని.. లేదు లేదు.. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఆది తీసుకువస్తాడనీ.. పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే.. ఎమ్మెల్యే, జబర్దస్త్ రోజా కూడా ఈ ఘటనపై స్పందించారని, లేదని అనేక పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
ఇదే ఘటనపై దొరబాబు భార్య కూడా స్పందించారు. ఆయన చాలా మంచి వారని.. అప్పుడప్పుడు మన కళ్లే మనల్ని మోసం చేస్తాయంటూ.. భర్తకు సపోర్ట్గా పలు కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆమె రోజా ‘రచ్చబండ’ కార్యక్రమానికి వెళ్లాలనే ప్రయత్నంలో ఆమె ఉన్నట్లు సమాచారం. భర్త దొరబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. పబ్లిక్గానే క్లారిటీ ఇవ్వాలనే నిర్ణయానికి దొరబాబు భార్య వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే.. దొరబాబు ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్న జబర్దస్త్ కమెడియన్స్తో పాటు రోజా వీరికి సపోర్ట్గా నిలవనున్నారట. అందుకే రచ్చబండ కార్యక్రమానికి పిలిచి అసలు ఆరోజు రాత్రి ఏం జరిగిందనేదానిపై ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వాలనుకున్నట్టు సమాచారం.
Read More this also: వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..
హీరో, హీరోయిన్కు కరోనా.. షాక్లో సినీ ఇండస్ట్రీ
మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు