AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్కి భగవాన్ ఆశ్రమం చుట్టూ పోలీసులు.. ఎందుకో తెలుసా?

కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ అధికారులు దాడి చేశారు. చిత్తూరు జిల్లా వరదాయపాళెం మండలంలోని బత్తులవల్లంలో ఉన్న కల్కిభగవాన్ ఆశ్రమంలో తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కల్కి భగవాన్ కార్యాలయాల్లో 40 చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బత్తులవల్లంలో ఉన్న ఏకం గోల్డెన్ సిటీ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీతో పాటు, సీఈవో లోకేష్ దాసోజీని సైతం ఐటీ అధికారులు విచారిస్తున్నారు. కల్కి భగవాన్‌కు తెలుగు […]

కల్కి భగవాన్  ఆశ్రమం చుట్టూ పోలీసులు.. ఎందుకో తెలుసా?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 16, 2019 | 4:18 PM

Share

కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ అధికారులు దాడి చేశారు. చిత్తూరు జిల్లా వరదాయపాళెం మండలంలోని బత్తులవల్లంలో ఉన్న కల్కిభగవాన్ ఆశ్రమంలో తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కల్కి భగవాన్ కార్యాలయాల్లో 40 చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బత్తులవల్లంలో ఉన్న ఏకం గోల్డెన్ సిటీ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీతో పాటు, సీఈవో లోకేష్ దాసోజీని సైతం ఐటీ అధికారులు విచారిస్తున్నారు.

కల్కి భగవాన్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ విదేశాల్లో సైతం పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. వీరి నుంచి సేకరించిన విరాళాలపై ఆరోపణలున్నాయి. భక్తుల నుంచి సేకరించినర సొమ్ముతో భారీగా స్థిరాస్తులు, డిపాజిట్లు చేసినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అదే విధంగా ఆశ్రమాలకు వస్తున్న విరాళాలకు సంబంధించి ఆదాయ పన్ను చెల్లింపులో తేడాలున్నట్టు కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. సోదాల నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.