గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న భారత ఓపెనర్ రోహిత్ శర్మను ఆదివారం బీసీసీఐ మెడికల్ టీమ్ పరీక్షించనుంది. అతనికి గాయం తగ్గిందా.. లేదా? ఇంకొంత రెస్ట్ అవసరమా? అన్న విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. రోహిత్కు గాయం తగ్గితే వికెట్ల మధ్య పరిగెత్తటం కష్టమేమీ కాదని అధికారులు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా టూర్కు రోహిత్ను టీమ్లోకి తీసుకోకపోవటంపై పలు అనుమానాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.