ఆదివారం రోహిత్​ గాయంపై బీసీసీఐ పరిశీలన

|

Oct 31, 2020 | 5:31 PM

గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న భారత ఓపెనర్ రోహిత్​ శర్మను ఆదివారం బీసీసీఐ మెడికల్ టీమ్ పరీక్షించనుంది.

ఆదివారం రోహిత్​ గాయంపై బీసీసీఐ పరిశీలన
Follow us on

గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న భారత ఓపెనర్ రోహిత్​ శర్మను ఆదివారం బీసీసీఐ మెడికల్ టీమ్ పరీక్షించనుంది. అతనికి గాయం తగ్గిందా.. లేదా? ఇంకొంత రెస్ట్ అవసరమా? అన్న విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. రోహిత్​కు గాయం తగ్గితే వికెట్ల మధ్య పరిగెత్తటం కష్టమేమీ కాదని అధికారులు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా టూర్‌కు రోహిత్​ను టీమ్‌లోకి తీసుకోకపోవటంపై పలు అనుమానాలు,  విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

అక్టోబరు 18న పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో రోహిత్​కు గాయమైంది. ఆ తర్వాత బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో అతడు ఆడలేదు. ఈ మ్యాచ్​లో గెలిచి ప్లేఆఫ్స్​లోకి వెళ్లింది ముంబయి. ఐపీఎ‌ల్ పూర్తవ్వగానే దుబాయ్​ నుంచి ఇండియా టీమ్ ఆస్ట్రేలియా వెళ్లనుంది. కోచ్, సిబ్బందితోపాటు, టెస్టు ఆటగాళ్లు పుజారా, విహారి త్వరలోనే దుబాయ్ చేరుకోనున్నారు.
Also Read :
ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్..
బిగ్‌బాస్‌ హౌస్‌లో ‘నెపోటిజం’ లొల్లి..సల్మాన్ సీరియస్