బిగ్‌బాస్‌ హౌస్‌లో ‘నెపోటిజం’ లొల్లి..సల్మాన్ సీరియస్

హీరో సుశాంత్ మరణం అనంతరం బాలీవుడ్‌లో నెెపోటిజంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పలువురు బడా సెలబ్రిటీలు ఇండస్ట్రీలో నెపోటిజాన్ని ప్రొత్సహిస్తున్నారనంటూ కంగనా సహా  పలువురు నటీనటులు ఫైరయ్యారు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో ‘నెపోటిజం’ లొల్లి..సల్మాన్ సీరియస్
Follow us

|

Updated on: Oct 31, 2020 | 5:17 PM

హీరో సుశాంత్ మరణం అనంతరం బాలీవుడ్‌లో నెెపోటిజంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పలువురు బడా సెలబ్రిటీలు ఇండస్ట్రీలో నెపోటిజాన్ని ప్రొత్సహిస్తున్నారనంటూ కంగనా సహా  పలువురు నటీనటులు ఫైరయ్యారు. వారికి నెటిజన్ల మద్దతు కూడా లభించింది. ఈ టాపిక్ ఇప్పుడిప్పుడే చల్లబడుతుంది అనుకుంటున్న సమయంలో హిందీ బిగ్ బాస్ వేదికగా మళ్లీ రచ్చకెక్కింది.  బంధుప్రీతిని రీజన్‌గా చూపిస్తూ.. బిగ్‌బాస్‌ సీజన్‌ 14 కంటెస్టెంట్‌ ఒకరు తోటి హౌస్‌మెట్‌ని నామినేట్‌ చేశారు. దాంతో వ్యాఖ్యాత‌‌ సల్మాన్‌ ఖాన్‌ ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌లో ఇలాంటి చర్చ  ఎందుకు తీసుకువచ్చారంటూ ఫైరయ్యారు.

వివరాల్లోకి వెళ్తే..  బిగ్‌బాస్‌‌ 14 గత వారం నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా రాహుల్‌ వైద్య, జాన్‌ కుమార్‌‌ సనుని నామినేట్‌ చేశాడు. బంధుప్రీతి అంటే తనకు అసహ్యమని.. అందుకే జాన్‌ని నామినేట్‌ చేసినట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాక జాన్‌కు అంత పాపులారిటీ లేదని.. కేవలం ప్రసిద్ధ సింగర్‌ కుమార్‌ సను తనయుడు అవ్వడం వల్లనే షోలో ఉండగల్గుతున్నాడని బాణాలు సంధించాడు. ఇక ఈ వ్యాఖ్యలపై హెస్ట్ సల్మాన్ ఫైరయినట్లు  తాజా ప్రోమోలు చూస్తే అర్థం అవుతోంది. వారంతం‌ ఎపిసోడ్‌లో సల్మాన్..‌ రాహుల్‌ వ్యాఖ్యలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Also Read : ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్..