Practice Session : టీమిండియా ప్రాక్టీస్‌కు అడ్డొచ్చిన వరుణుడు.. జిమ్​లో చెమట చిందిస్తున్న ఆటగాళ్లు

| Edited By: Ram Naramaneni

Jan 04, 2021 | 8:18 AM

మూడో టెస్టు మ్యాచ్‌ కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లకు వరుణుడు అడ్డొచ్చాడు. మెల్​బోర్న్​లో ఆదివారం జోరుగా వర్షం కురవడంతో మైదానం తడిసి ముద్దైంది..

Practice Session : టీమిండియా ప్రాక్టీస్‌కు అడ్డొచ్చిన వరుణుడు.. జిమ్​లో చెమట చిందిస్తున్న ఆటగాళ్లు
Follow us on

Practice Session : మూడో టెస్టు మ్యాచ్‌ కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లకు వరుణుడు అడ్డొచ్చాడు. మెల్​బోర్న్​లో ఆదివారం జోరుగా వర్షం కురవడంతో మైదానం తడిసి ముద్దైంది. మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో వర్షం పడిన కారణంగా ఆదివారం జరగాల్సిన భారత జట్టు​ ప్రాక్టీస్ సెషన్​ అర్ధంతరంగా నిలిచిపోయింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI ) ప్రకటించింది.

మైదానంలో ప్రాక్టీస్​ లేనందున జిమ్​లో ఆటగాళ్లు చెమట చిందించారని బోర్డు తెలిపింది. జనవరి 7న జరిగే మూడో టెస్టు కోసం ఇరు జట్లు సిడ్నీకి సోమవారం బయలుదేరనున్నాయి.

వన్డే సిరీస్​ను 1-2 తేడాతో కోల్పోయిన టీమ్​ఇండియా.. టీ20 సిరీస్​ను 2-1 తేడాతో గెల్చుకుంది. ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్న టెస్టు సిరీస్​ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

ఇవి కూడా చదవండి..

చివరి టెస్టు మ్యాచ్‌పై అనుమానాలు.. ఆటగాళ్ల ఐసోలేషన్ నిర్ణయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న టీమిండియా
అమ్మా..! సంక్రాంతికి వస్తాను.. వీర జవాన్ చెప్పిన చివరి మాటలు.. మంచు కొండల్లో అమరుడైన తెలుగు ముద్దుబిడ్డ ..