AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏప్రిల్ 1 నుంచి PNR Linking

ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే అనేక సంస్కరణలు చేపడుతోంది. అందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో ఒకటి PNR Linking. ప్రయాణికులకు మేలు చేసేందుకు రైల్వే తీసుకున్న కొత్త నిర్ణయమిది. పీఎన్ఆర్ లింకింగ్ దూరప్రయాణం చేసే రైల్వే ప్రయాణికులకు ఉపయోగపడుతుంది. దూర ప్రయాణీకులు లాంగ్ టూర్ ప్లాన్ చేసుకొన్నప్పుడు ఒకేసారి రెండుమూడు రైళ్లు కనెక్ట్ అయ్యేలా టికెట్ బుక్ చేసుకొని ఉంటారు. గమ్యస్థానానికి నేరుగా ట్రైన్ లేకపోతే చాలామంది ఇలా […]

ఏప్రిల్ 1 నుంచి PNR Linking
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 15, 2019 | 6:26 PM

Share

ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే అనేక సంస్కరణలు చేపడుతోంది. అందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో ఒకటి PNR Linking. ప్రయాణికులకు మేలు చేసేందుకు రైల్వే తీసుకున్న కొత్త నిర్ణయమిది. పీఎన్ఆర్ లింకింగ్ దూరప్రయాణం చేసే రైల్వే ప్రయాణికులకు ఉపయోగపడుతుంది.

దూర ప్రయాణీకులు లాంగ్ టూర్ ప్లాన్ చేసుకొన్నప్పుడు ఒకేసారి రెండుమూడు రైళ్లు కనెక్ట్ అయ్యేలా టికెట్ బుక్ చేసుకొని ఉంటారు. గమ్యస్థానానికి నేరుగా ట్రైన్ లేకపోతే చాలామంది ఇలా కనెక్టింగ్ రైళ్లను బుక్ చేసుకోవడం మామూలే. అలాంటి సందర్భాల్లో మొదటి రైలు ఆలస్యంగా రావడం వల్ల రెండో రైలు మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. దీని వల్ల ఇన్నాళ్లూ ప్రయాణికులు తీవ్రంగా నష్టపోయేవాళ్లు. ప్రయాణికులు అలా నష్టపోకుండా రైల్వే తీసుకున్న నిర్ణయమే ‘పీఎన్ఆర్ లింకింగ్’. అంటే మీరు బుక్ చేసుకున్న ప్రతీ టికెట్‌కు వేర్వేరు పీఎన్ఆర్ నెంబర్లు ఉంటాయి. వాటిని అనుసంధానించడమే ‘పీఎన్ఆర్ లింకింగ్’. దీని ద్వారా మీ రెండో రైలు మిస్ అయితే రీఫండ్ పొందడం సులువు. 2019 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.

రీఫండ్ రూల్స్…

  • పీఎన్ఆర్ లింకింగ్ ద్వారా ఎలాంటి ఛార్జీలు లేకుండా రీఫండ్ పొందొచ్చు.
  • ఈ సదుపాయం అన్ని క్లాసుల టికెట్లకు వర్తిస్తుంది.
  • రెండు టికెట్లపై ప్యాసింజర్ వివరాలు ఒకేలా ఉండాలి.
  • మొదటి రైలులో మీరు ఎంచుకున్న గమ్యస్థానం, రెండో రైలు ప్రారంభమయ్యే స్టేషన్ ఒకటై ఉండాలి.
  • ఐఆర్‌సీటీసీలో తీసుకున్న టికెట్లతో పాటు రైల్వే కౌంటర్లలో తీసుకున్న టికెట్లకూ పీఎన్ఆర్ లింక్ చేయొచ్చు.
  • మీరు మిస్ అయిన రైలు టికెట్ డబ్బులు మాత్రమే రీఫండ్ వస్తాయి.
  • మీరు రైలు దిగిన మొదటి మూడు గంటల్లో టికెట్ సరెండర్ చేస్తే క్యాన్సలేషన్ లేదా ఇతర ఛార్జీలేవీ ఉండవు.
  • రైల్వే స్టేషన్‌లోనే మీరు రీఫండ్ పొందొచ్చు.
  • ఆ రైల్వే స్టేషన్‌లో రీఫండ్ ఇవ్వకపోతే టీడీఆర్ ఫైల్ చేయొచ్చు.