మాల్దీవులు వేదికగా పాకిస్తాన్ కు పరాభవం!

అంతర్జాతీయ వేదికపై కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించి పాకిస్థాన్‌ మరోసారి అపహాస్యం పాలైంది. మాల్దీవుల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఈ ఘటన జరిగింది. పాక్‌ ప్రతినిధి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడంతో భారత్‌ దాన్ని దీటుగా తిప్పికొట్టింది. భారత అంతర్గత అంశాన్ని ప్రస్తావించి పాకిస్థాన్‌ ఈ వేదికను రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలని చూస్తోందని భారత్‌ మండిపడింది. ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అధిగమించడం’ అన్న అంశంపై సదస్సు కోసం మాల్దీవుల పార్లమెంటు భవనం వేదికైంది. ఈ సదస్సుకు […]

మాల్దీవులు వేదికగా పాకిస్తాన్ కు పరాభవం!
India-Pakistan
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 6:00 AM

అంతర్జాతీయ వేదికపై కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించి పాకిస్థాన్‌ మరోసారి అపహాస్యం పాలైంది. మాల్దీవుల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఈ ఘటన జరిగింది. పాక్‌ ప్రతినిధి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడంతో భారత్‌ దాన్ని దీటుగా తిప్పికొట్టింది. భారత అంతర్గత అంశాన్ని ప్రస్తావించి పాకిస్థాన్‌ ఈ వేదికను రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలని చూస్తోందని భారత్‌ మండిపడింది. ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అధిగమించడం’ అన్న అంశంపై సదస్సు కోసం మాల్దీవుల పార్లమెంటు భవనం వేదికైంది. ఈ సదస్సుకు భారత్‌ నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ హాజరయ్యారు.పార్లమెంటులో సుస్థిరాభివృద్ధిపై చర్చ జరుగుతుండగా, పాకిస్థాన్‌ నుంచి హాజరైన ప్రతినిధి ఖాసిమ్‌ సూరీ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీరీల అణచివేతను తాము సహించేది లేదని వ్యాఖ్యానించడంతో సభలో నిరసనలు మొదలయ్యాయి. పాక్‌ తీరుకు భారత ప్రతినిధులు ఓం బిర్లా, నారాయణ్‌ సింగ్‌ దీటుగా బదులిచ్చారు. ”కశ్మీర్‌ అంశాన్ని ఈ వేదికపై లేవనెత్తడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అది భారత అంతర్గత వ్యవహారం. ఇలాంటి అంశాలు లేవనెత్తి సదస్సును రాజకీయ అవసరాల కోసం వాడుకోవడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.

అనంతరం పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేయాలని సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఈ సదస్సు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం ఉద్దేశించినదని, పాక్‌ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. వెంటనే పాకిస్థాన్ మరో ప్రతినిధి ఖురాత్‌ ఉల్‌ ఐన్‌ మర్రి వాదనకు దిగడంతో ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న మాల్దీవుల స్పీకర్‌ మహ్మద్‌ నషీద్‌ ఆమెను అడ్డుకున్నారు. ఒకప్పుడు తమ సొంత ప్రజలైన బంగ్లాదేశీయులపై మారణ హోమానికి తెగబడ్డ దేశానికి కశ్మీర్ సమస్య లేవనెత్తే నైతిక హక్కు లేదని భారత్‌ ఉద్ఘాటించింది. చివరికి పాక్‌ లేవనెత్తిన అంశాలన్నీ రికార్డుల నుంచి తొలగిస్తామని మాల్దీవుల స్పీకర్‌ నషీద్‌ భారత ప్రతినిధులకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు