AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజమండ్రిలో కరోనా విలయతాండవం

రోజు రోజుకు రాజమండ్రిలో కొవిడ్ వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రాజమండ్రి అర్బన్ పరిధిలో విజ‌ృంభన అధికంగా ఉంది. ఈ ఒక్క రోజే కొత్తగా 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా అధికారిక లెక్కలు చెబతున్నాయి. ఇప్పటి వరకు అర్బన్ పరిధిలో 1910 మంది కరోనా బాధితులు ఉన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 51 కట్టడి ప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. రాజమండ్రి రూరల్ పరిధిలో ఇవాళ కొత్తగా 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి […]

రాజమండ్రిలో కరోనా విలయతాండవం
Sanjay Kasula
|

Updated on: Aug 03, 2020 | 10:23 PM

Share

రోజు రోజుకు రాజమండ్రిలో కొవిడ్ వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రాజమండ్రి అర్బన్ పరిధిలో విజ‌ృంభన అధికంగా ఉంది. ఈ ఒక్క రోజే కొత్తగా 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా అధికారిక లెక్కలు చెబతున్నాయి. ఇప్పటి వరకు అర్బన్ పరిధిలో 1910 మంది కరోనా బాధితులు ఉన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 51 కట్టడి ప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. రాజమండ్రి రూరల్ పరిధిలో ఇవాళ కొత్తగా 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రూరల్ పరిధిలో 2053 మంది కరోనా బారిన పడ్డారు. కాగా, 176 కట్టడి ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉపయోగం లేకుండా పోతోంది.