గన్ పార్కు వద్ద ట్రాఫిక్ అంక్షలు..!
ఉదయం 8.30 గంటలకు గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళ్లు. అసెంబ్లీ అవరణలో ట్రాఫిక్ అంక్షలు.

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని..రేపు ఉదయం 8.30 గంటలకు గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకు రాజ్ భవన్ రోడ్, నిరంకారి భవన్, ఖైరతాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్, రవీంద్రభారతి జంక్షన్, నాంపల్లి ఏఆర్ పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ను నిలివేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Follow Us
