వార్తా ఛానెల్పై సినీ నటి ఆగ్రహం
బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ ఓ వార్తా ఛానల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే… సల్మాన్ ఖాన్ సోదరుడు సొహైల్ ఖాన్ తన భార్య సీమా ఖాన్తో కలిసి ఇటీవల ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ స్పెషల్ స్క్రీనింగ్ వేడుకకు హాజరయ్యారు. ఆ సినిమా చూడటానికి హుమా ఖురేషీ కూడా వెళ్లారు. హుమా, సొహైల్ ఒకప్పుడు ప్రేమించుకున్నారని టాక్. ఓ వార్తా ఛానల్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ… ‘స్పెషల్ స్క్రీనింగ్ చూసేందుకు వచ్చిన సొహైల్ […]
బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ ఓ వార్తా ఛానల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే… సల్మాన్ ఖాన్ సోదరుడు సొహైల్ ఖాన్ తన భార్య సీమా ఖాన్తో కలిసి ఇటీవల ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ స్పెషల్ స్క్రీనింగ్ వేడుకకు హాజరయ్యారు. ఆ సినిమా చూడటానికి హుమా ఖురేషీ కూడా వెళ్లారు. హుమా, సొహైల్ ఒకప్పుడు ప్రేమించుకున్నారని టాక్.
ఓ వార్తా ఛానల్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ… ‘స్పెషల్ స్క్రీనింగ్ చూసేందుకు వచ్చిన సొహైల్ దంపతులు, హ్యూమాను పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దాంతో హ్యూమా చాలా బాధపడ్డారు’ అని ప్రచురించింది.
ఈ ఆర్టికల్ కాస్తా హుమా దృష్టికి వచ్చింది. దాంతో ఆమె ఆ ఆర్టికల్ను ట్యాగ్ చేస్తూ.. ‘మీ చెత్త ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వలేదని నా గురించి ఇలాంటి చెత్తంతా రాస్తారా? సిగ్గులేకపోతే సరి. నా పేరును చెడగొట్టడానికి మీకెంత ధైర్యం. ఇలా చేసినందుకు నాకు, సొహైల్ దంపతులకు క్షమాపణలు చెప్పండి ’ అని హ్యూమా నిప్పులు చెరిగారు.