సమంత విసిరిన ఛాలెంజ్ను స్వీకరించిన రష్మిక..
అక్కినేని సమంత విసిరిన ఛాలెంజ్ను స్వీకరించింది హీరోయిన్ రష్మికా మండన్న. అదేంటని అనుకుంటున్నా.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్లో భాగంగా నటీనటులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి...
అక్కినేని సమంత విసిరిన ఛాలెంజ్ను స్వీకరించింది హీరోయిన్ రష్మికా మండన్న. అదేంటని అనుకుంటున్నా.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్లో భాగంగా నటీనటులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి.. తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటింది యంగ్ హీరోయిన్ రష్మిక మండన్న. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పేర్కొంది.
ఈ సందర్భంగా తాను నాటిన మొక్కతో ఫొటో తీసుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది రష్మిక. ఈ ఛాలెంజ్లోకి నన్ను ఆహ్వానించిన సమంతకు థాంక్స్ అని చెప్పింది. తన అభిమానులను కూడా అదే విధంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను కొనసాగించాలని వెల్లడించింది. ఈ సందర్భంగా తన సహచర హీరోయిన్లు అయిన రాశి ఖన్న, కళ్యాణి ప్రియదర్శన్లను ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరింది.