సమంత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రష్మిక..

అక్కినేని సమంత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించింది హీరోయిన్ రష్మికా మండన్న. అదేంటని అనుకుంటున్నా.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా నటీనటులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి...

సమంత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రష్మిక..
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 10:14 AM

అక్కినేని సమంత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించింది హీరోయిన్ రష్మికా మండన్న. అదేంటని అనుకుంటున్నా.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా నటీనటులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత ఇచ్చిన ఛాలెంజ్‌ స్వీకరించి.. తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటింది యంగ్ హీరోయిన్ రష్మిక మండన్న. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పేర్కొంది.

ఈ సందర్భంగా తాను నాటిన మొక్కతో ఫొటో తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రష్మిక. ఈ ఛాలెంజ్‌లోకి నన్ను ఆహ్వానించిన సమంతకు థాంక్స్ అని చెప్పింది. తన అభిమానులను కూడా అదే విధంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను కొనసాగించాలని వెల్లడించింది. ఈ సందర్భంగా తన సహచర హీరోయిన్లు అయిన రాశి ఖన్న, కళ్యాణి ప్రియదర్శన్‌లను ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరింది.