సరికొత్త రికార్డ్.. ఇంటర్నెట్ వాడకంలో.. పట్టణాలను దాటేసిన పల్లెటూర్లు!

| Edited By:

May 06, 2020 | 8:29 PM

Internet Usage: కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే.. భారత్‌లో మొట్టమొదటి సారిగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య పట్టణాల్లో కన్నా పల్లెటూర్లలో ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), నీల్సన్ తాజా నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2019 నవంబర్ నాటికి చూస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో 22.7 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని […]

సరికొత్త రికార్డ్.. ఇంటర్నెట్ వాడకంలో.. పట్టణాలను దాటేసిన పల్లెటూర్లు!
Follow us on

Internet Usage: కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే.. భారత్‌లో మొట్టమొదటి సారిగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య పట్టణాల్లో కన్నా పల్లెటూర్లలో ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), నీల్సన్ తాజా నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2019 నవంబర్ నాటికి చూస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో 22.7 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లతో పోలిస్తే ఈ సంఖ్య 10 శాతం ఎక్కువ. పట్టణాల్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 20.5 కోట్లుగా ఉంది.

కాగా.. దాదాపు 7.1 కోట్ల మంది కిడ్స్ (5-11 ఏళ్లు) కుటుంబ సభ్యుల స్మార్ట్‌ఫోన్స్ తీసుకొని ఆన్‌లైన్‌లోకి వస్తున్నారు. దీంతో దేశంలో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 50.4 కోట్లకు చేరింది. నెలలో ఒక్కసారైనా ఇంటర్నెట్ ఉపయోగించే వారిని యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్‌గా పరిగణిస్తాం. ఇంటర్నెట్ యూజర్ల పరంగా చూస్తే.. ప్రపంచంలో చైనా తర్వాత భారత్ ఇప్పుడు రెండో అతిపెద్ద దేశంగా కొనసాగుతోంది. చైనాలో దాదాపు 85 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఇక అమెరికా మూడో స్థానంలో ఉంది. ఈ దేశంలో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30 కోట్లుగా ఉంది.