
తెలంగాణలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. విదేశాల నుంచి వచ్చినవారికి కాకుండా ఫస్ట్ టైమ్ లోకల్గా ఓ మహిళకు కరోనాకు సోకింది. దీన్నే ప్రైమరీ కాంటాక్ట్ అంటారు. పి-14 కేసు ద్వారా ఇది స్థానికంగా ఒకరికి అంటుకున్నట్టు కన్ఫామ్ అయ్యింది. కరోనా సోకిన మహిళ కేపీహెచ్బీలోని ఫేజ్-2 లో నివశిస్తోంది. ఇటీవలే బాధితురాలి సోదరుడు యూకే నుంచి వచ్చాడు. ఆమె ఇంట్లో మరో ఇద్దరికి కూడా కరోనా సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన 21 కేసుల్లో కూడా అందరూ విదేశాల నుంచి వచ్చినవారే. అలా వచ్చినవారి నుంచి ఫస్ట్ టైమ్ వైరస్ మరొకరికి అంటుకుంది. ఇది రాష్ట్రంలో తొలి ప్రైమరీ కాంటాక్ట్ కేసు.