AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్ష బీభత్సంః ఇంకా ఆచూకీ లేని ఒకే కుటుంబానికి చెందిన 8 మంది

ప్రకృతి ప్రకోపానికి హైదరాబాద్ మహానగరం గజగజ వణికిపోయింది. ఓ వైపు మాయదారి కరోనాతో ఇబ్బందులు పడుతున్న జనానికి తోడు.. వరుసగా కురుస్తున్న అకాల వర్షాలతో సగటు నగరవాసి విలవిల్లాడిపోతున్నాడు.

వర్ష బీభత్సంః ఇంకా ఆచూకీ లేని ఒకే కుటుంబానికి చెందిన 8 మంది
Balaraju Goud
|

Updated on: Oct 15, 2020 | 11:50 AM

Share

ప్రకృతి ప్రకోపానికి హైదరాబాద్ మహానగరం గజగజ వణికిపోయింది. ఓ వైపు మాయదారి కరోనాతో ఇబ్బందులు పడుతున్న జనానికి తోడు.. వరుసగా కురుస్తున్న అకాల వర్షాలతో సగటు నగరవాసి విలవిల్లాడిపోతున్నాడు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిసరాల్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయి. వర్షాలకు అనుకూలమైన సాధారణ మేఘాలతోపాటు క్యుములోనింబస్‌ ప్రభావంతో రెండు నెలల నుంచి భాగ్యనగరంలో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పడ్డాయి.

భాగ్యనగరంలో వర్షాలు సృష్టించిన బీభత్సం అంతఇంతకాదు. రాజేంద్రనగర్ పల్లె చెరువు కట్ట తెగడంతో మైలార్ దేవుపల్లి అలీనగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది వరద నీటిలో గల్లంతయ్యారు. కాగా.. దార్కస్ ఖురేషీ , ఫర్జానా తబస్సుమ్‌ల ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఏ క్షణమైనా పల్లె చెరువు కట్ట పూర్తిగా తెగే అవకాశం ఉందని అటు అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే, దిగువ ఉన్న కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. పల్లె చెరువు తెగితే అలీనగర్, అల్ జుబేల్ కాలనీ పూర్తిగా నీట మునిగే ప్రమాదం ఉంది. మరోవైపు, లోతట్టు ప్రాంతాలవారిని ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేశారు.