ఇండియాకు గిఫ్ట్, పాకిస్తాన్ కు షాక్, సౌదీ అరేబియా నిర్ణయం

ఇండియాకు సౌదీ అరేబియా 'దీపావళి గిఫ్ట్' ఇచ్చింది. అదేసమయంలో పాకిస్తాన్ కు షాకిచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను, గిల్గిట్-బల్టిస్తాన్ భూభాగాలను పాకిస్తాన్ మ్యాప్ నుంచి తొలగించింది.

ఇండియాకు గిఫ్ట్, పాకిస్తాన్ కు షాక్, సౌదీ అరేబియా నిర్ణయం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 29, 2020 | 1:58 PM

ఇండియాకు సౌదీ అరేబియా ‘దీపావళి గిఫ్ట్’ ఇచ్చింది. అదేసమయంలో పాకిస్తాన్ కు షాకిచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను, గిల్గిట్-బల్టిస్తాన్ భూభాగాలను పాకిస్తాన్ మ్యాప్ నుంచి తొలగించింది. నవంబరు 21-22 తేదీల్లో జీ-20 సమ్మిట్ ను నిర్వహించనున్న సందర్భంగా 20 రియాల్ బ్యాంక్ నోటుపై మొదట ఈ మ్యాప్ ను ముద్రించినప్పటికీ ఆ తరువాత తొలగించారు. తొలుత  ఈ భూభాగాలను పాక్ లో ఉన్నట్టు చూపారని, కానీ ఆ తరువాత తొలగించడం చూస్తే ఇది ఇండియాకు సౌదీ అరేబియా దీపావళి గిఫ్ట్ ఇఛ్చినట్టే భావించాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా పీఓకే యాక్టివిస్ట్ ఒకరు కూడా ఇలాగే ట్వీట్ చేశారు.