దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ, ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌక వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. భారత యుద్ధనౌకను రాజీవ్ గాంధీ తన విహారానికి వాడుకున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలు చేయడంతో ఈ వివాదం రేగింది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ను ఈ వ్యవహారంలోకి లాగుతూ కాంగ్రెస్ నేత దివ్య స్పందన వ్యాఖ్యానించడంతో ఇది ఆసక్తికర మలుపు తిరిగింది. యుద్ధనౌకను వినియోగించినప్పుడు ఏం జరిగిందో అమితాబ్కి తెలుసుననీ.. ఈ వ్యవహారంపై ఆయన నిజాలు వెల్లడించాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా ఐఏఎస్ మాజీ అధికారి హబీబుల్లా వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. ఐఎన్ఎస్ విరాట్ 1984లో లక్షద్వీప్ వద్ద ఉన్నప్పుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ఆయన సన్నిహితులు ఆ ద్వీపంలో ఉన్న సమయంలో హబీబుల్లా ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం..ఆ ద్వీపంలో రాజీవ్ తో పాటు అమితాబ్ ఇతర సన్నిహితులు కూడా ఉన్నారని, వారి ప్రయాణానికి వ్యక్తిగత హెలికాప్టర్ను ఉపయోగించారని, ఈ యుద్ధ నౌకను కాదని ఆ పత్రిక పేర్కొంది. దాన్ని ఉద్దేశించి దివ్య స్పందన ట్విటర్ వేదికగా అమితాబ్ బచ్చన్ను వాస్తవాలు వెల్లడించారని కోరారు. ‘వాస్తవాలు వెల్లడించండి. ఈ సమయంలో మీపై మాట్లాడమని ఒత్తిడి తెస్తున్నారని భావించొద్దు’ అని ఆమె ట్వీట్ చేశారు.
Admiral L Ramdas also clears the air on Rajiv Gandhiji’s trip to Lakshadweep. Now can the PrimeLiar @narendramodi and everybody else who lied and defamed him & the army please apologise? Or is it too much to expect from uncouth people? #SabseBadaJhootaModi pic.twitter.com/qbrPez4LSM
— Divya Spandana/Ramya (@divyaspandana) May 9, 2019
‘PM is lying about INS Viraat incident; check with Bachchan in case of doubt’: Wajahat Habibullah#SabseBadaJhootaModi https://t.co/0hNnheNCPi
— Divya Spandana/Ramya (@divyaspandana) May 9, 2019