బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్

|

Mar 09, 2019 | 6:23 PM

కర్ణాటక: కరడుగట్టిన ఉగ్రవాది, జేషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను విడిచిపెట్టింది మీరు కాదా? అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భాజపా మీద విరుచుకుపడ్డారు. బాలాకోట్ ఉగ్రస్థావరం మీద వైమానిక దాడులు జరిగాయని పాకిస్థాన్ ఒప్పుకున్నా, విపక్షాలు మాత్రం వాటిపై ఇంకా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కర్ణాటకలోని హావేరిలో జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ […]

బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్
Follow us on

కర్ణాటక: కరడుగట్టిన ఉగ్రవాది, జేషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను విడిచిపెట్టింది మీరు కాదా? అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భాజపా మీద విరుచుకుపడ్డారు. బాలాకోట్ ఉగ్రస్థావరం మీద వైమానిక దాడులు జరిగాయని పాకిస్థాన్ ఒప్పుకున్నా, విపక్షాలు మాత్రం వాటిపై ఇంకా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కర్ణాటకలోని హావేరిలో జరిగిన సభలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..‘కొద్ది రోజుల క్రితం పుల్వామా ఘటనలో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది మరణించారు. దానిపై ప్రధానికి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. వారిని ఎవరు చంపారు? జైషే మహ్మద్ అధినేత పేరేంటి? మసూద్ అజార్‌ను వెనక్కి పంపించింది ఎవరు? మేము మీలా కాదు. ఉగ్రవాదం ముందు తలవంచం. అలాగే దేశానికి ఇంకో విషయం కూడా చెప్పాలని కోరుతున్నాను. మీరు చైనా అధ్యక్షుడితో కలిసి ఊయలలో కూర్చున్న సమయంలో చైనా ఆర్మీ డోక్లామ్ ప్రాంతంలోకి చొచ్చుకొని వచ్చింది. ఇప్పటికీ చైనా ఆర్మీ అక్కడే ఉందని ప్రపంచం మొత్తానికి తెలుసు. మీరు మాత్రం ఏ అజెండా లేకుండా చైనాకు వెళ్లారు’ అని ఈ ఐదేళ్ల కాలంలో భాజపా హయాంలో చోటుచేసుకున్న పరిమాణాలపైనా విమర్శలు చేశారు. అలాగే 2019లో తాము అధికారంలోకి రాగానే కనీస ఆదాయ హామీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. రైతులు దేశానికి వెన్నెముక వంటి వారని, తమ పార్టీ వారితోనే ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జీఎస్టీలో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు.