ధోని రనౌట్‌తో అభిమాని మృతి..

| Edited By: Srinu

Jul 11, 2019 | 4:07 PM

భారత్-కివీస్ మధ్య జరిగిన సెమీస్ ఫైనల్ కోల్‌కతాలో విషాదం నింపింది. ధోనీ రనౌట్ కావడంతో తట్టుకోలేకపోయిన శ్రీకాంత్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ప్రపంచకప్‌ లీగ్ దశలో టాప్‌ ప్లేస్‌లో నిలిచిన టీమిండియా సెమీస్‌లో కివీస్ చేతిలో ఓడిపోవడాన్ని భారత అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ భారీ భాగస్వామ్యంతో జట్టులో ఆశలు రేపారు. అయితే జడేజా నిష్కమించినా ధోనీ ఉండటంతో భారత అభిమానుల్లో మళ్లీ ఆశ చిగురించింది. […]

ధోని రనౌట్‌తో అభిమాని మృతి..
Follow us on

భారత్-కివీస్ మధ్య జరిగిన సెమీస్ ఫైనల్ కోల్‌కతాలో విషాదం నింపింది. ధోనీ రనౌట్ కావడంతో తట్టుకోలేకపోయిన శ్రీకాంత్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ప్రపంచకప్‌ లీగ్ దశలో టాప్‌ ప్లేస్‌లో నిలిచిన టీమిండియా సెమీస్‌లో కివీస్ చేతిలో ఓడిపోవడాన్ని భారత అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ భారీ భాగస్వామ్యంతో జట్టులో ఆశలు రేపారు. అయితే జడేజా నిష్కమించినా ధోనీ ఉండటంతో భారత అభిమానుల్లో మళ్లీ ఆశ చిగురించింది. రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన దశలో 49వ ఓవర్ తొలి బంతికే ధోనీ సిక్స్ కొట్టడంతో అభిమానులు మురిసిపోయారు.

అదే ఓవర్ మూడో బంతికి రెండో పరుగు తీసేందుకు ప్రయత్నించి ధోనీ రనౌట్ కావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటివరకు మిణుకుమిణుకుమంటూ ఉన్న ఆశలు అతడి నిష్క్రమణతో మూసుకుపోయాయి. కోల్‌కతాకు చెందిన శ్రీకాంత్ ధోనికి వీరాభిమాని. అప్పటి వరకూ మొబైల్ ఫోన్‌లో మ్యాచ్ చూస్తున్న శ్రీకాంత్ ధోని రనౌట్ కావడంతో తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడిని గమనించిన స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.