AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చపాతీల లొల్లి.. చల్లగా ఉన్నాయని యజమానిని తుపాకితో కాల్చిన కస్టమర్.. ఉత్తర ప్రదేశ్‏లో దారుణం..

చపాతీల గొడవతో ఓ డాబా యజమానిని కాల్చేశాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‏లో గురువారం జరిగింది. వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్‏కు చెందిన అమిత్ చౌహన్, కసుస్తాబ్ సింగ్ అనే ఇద్దరు

చపాతీల లొల్లి.. చల్లగా ఉన్నాయని యజమానిని తుపాకితో కాల్చిన కస్టమర్.. ఉత్తర ప్రదేశ్‏లో దారుణం..
Rajitha Chanti
|

Updated on: Dec 25, 2020 | 7:32 PM

Share

చపాతీల గొడవతో ఓ డాబా యజమానిని కాల్చేశాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‏లో గురువారం జరిగింది. వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్‏కు చెందిన అమిత్ చౌహన్, కసుస్తాబ్ సింగ్ అనే ఇద్దరు యువకులు గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఓ డాబాకు వెళ్ళారు. అందులో చపాతీలను ఆర్డర్ చేశారు. రాత్రి సమయంలో డాబా మూసివేయడానికి సిద్దంగా ఉందని.. మిగిలి ఉన్న చపాతీలను ఆ డాబా యజమాని వారికి ఇచ్చాడు. దీంతో చల్లని చపాతీలు ఇస్తావా అంటూ అతనితో గొడవకు దిగారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కసుస్తాబ్ సింగ్ తన జేబులో వెంటతెచ్చుకున్న తుపాకి తీసి డాబా యజమానిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ అతడి తొడలోకి వెళ్ళింది. వెంటనే స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు చికిత్స చేసి బుల్లెట్‏ను బయటకు తీశారు. ప్రస్తుతం డాబా యజమాని ప్రాణాపాయం నుంచి తప్పించుకొని చికిత్స తీసుకుంటున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.